PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాఠ‌శాల‌లో కాల్పులు.. 21 మంది మృతి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అమెరికాలో మరోసారి కాల్పులు క‌ల‌క‌లం రేగింది టెక్సాస్‌లోని ఓ ఎలిమెంటరీ పాఠశాలలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 19 మంది చిన్నారులు సహా 21 మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు టీచర్లు కూడా ఉన్నారు. మృతి చెందిన విద్యార్థుల వయసు 4 నుంచి 11 ఏళ్ల మధ్య ఉంటుందని అక్కడి అధికారులు తెలిపారు. ఈ పాఠశాలలో మొత్తం 500 మంది విద్యార్థులు చదువుతున్నారు. మెక్సికన్‌ సరిహద్దులోని ఉవాల్డే నగరంలో అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. గత కొన్నేళ్లలో ఇది అత్యంత ఘోరమైన ఘటన ఇదేనని రాష్ట్ర గవర్నర్‌ గ్రేగ్‌ అబాట్‌ పేర్కొన్నారు.

                                      

About Author