క్రిష్ణగిరి మండలంలో 80 కుటుంబాలు టిడిపిలో చేరిక
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2024/02/4-10.jpg?fit=550%2C309&ssl=1)
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : పత్తికొండ నియోజకవర్గం క్రిష్ణగిరి మండలం అముకుతాడు గ్రామపంచాయతీకి చెందిన దూదేకుల,గంపనెత్తి, కోయిలకొండ గుంపులకు చెందిన దాదాపుగా 80 కుటుంబాలు 300 మంది తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే అవలంబిస్తున్న ధోరణి నచ్చక, గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి జరగక పోగా గొడవలు దౌర్జన్యాలు అలాగే బడుగు బలహీన వర్గాలపై పెత్తందారీ విధానం నచ్చక సోమవారం పత్తికొండ పత్తికొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బడుగు బలహీన వర్గాలకు అండదండగా నిలిచిన బీసీ నాయకుడు పత్తికొండ నియోజకవర్గం ఇన్చార్జివర్యులు కేఈ శ్యాం కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరినట్లు అమకతాడు గ్రామస్తులు తెలిపారు.ఈ కార్యక్రమంలో క్రిష్ణగిరి మండలం ముఖ్య నాయకులు అలాగే అముకుతాడు గ్రామానికి చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు .
![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2024/02/41-3.jpg?resize=550%2C309&ssl=1)