PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కామవరపు కోటలో ఆత్మీయ సమావేశం

1 min read

వైసిపి కి చెందిన 200 మంది కుటుంబాల వారు టిడిపిలో చేరిక

టిడిపి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఘంటా సత్యం బాబు

కూటమి నాయకులకు దిశ నిర్దేశం

కార్యకర్తల్లో జోష్ నింపిన యువ కెరటం ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : చింతలపూడి నియోజకవర్గం, కామవరపుకోటలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా ఏలూరు టిడిపి పార్లమెంటు అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఆయన మాటలతో కార్యకర్తలలో మరింత జోష్ నింపారు. సభ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, చింతలపూడి నియోజకవర్గం ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి సొంగ రోషన్, దెందులూరు నియోజకవర్గం ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, మాజీ ఎం ఎల్ ఏ గంట మురళి స్థానిక ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆత్మీయ సదస్సులో పాల్గొన్నారు. ఈ సభా ప్రాంగణంలో వైసీపీ పార్టీ నుండి టీడీపీ పార్టీలోకి 200 మంది కుటుంబాలతో సహా చేరారు. చేరిన వారిని ఘంటా సత్యం బాబు  కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

About Author