PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిజం గెలవాలి కార్యక్రమానికి మద్దతుగా మహిళల కొవ్వొత్తుల ప్రదర్శన

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమానికి కర్నూల్ నగరంలోని మహిళలు మద్దతు తెలిపారు. కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ టిజి భరత్ ఆధ్వర్యంలో నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయం ఎదురుగా మహిళా నాయకురాళ్లు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. చంద్రబాబు నాయుడు కి మద్దతుగా నినాదాలు చేశారు. నారా భువనేశ్వరికి రాష్ట్రంలోని మహిళలు అందరూ అండగా ఉన్నారని చెప్పారు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారన్నారు. చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా నిజం గెలుస్తుందని మహిళలు ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాళ్లు సంజీవలక్ష్మి, విజయలక్ష్మి, రాజ్యలక్ష్మి, లలితమ్మ, మున్ని, శాంతమ్మ, చిట్టెమ్మ, చిన్నమ్మ, సౌభాగ్య, కృష్ణవేణి, లీలావతి, మైమున్నా, మంగమ్మ, సంధ్య, స్వర్ణలత, గీత, దీప్తి తదితరులు పాల్గొన్నారు.

About Author