కార్యకర్తలకు అండగా ఉందాం..
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2024/06/835.jpg?fit=550%2C575&ssl=1)
అభ్యర్థులకు సూచించిన మాజీ సీఎం వైఎస్ జగన్
కర్నూలు, పల్లెవెలుగు: తాజా ఎన్నికల ఫలితాలతో తీవ్ర అసంతృప్తికి గురైన నాయకులు, కార్యకర్తలకు అండగా ఉందామని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ అభ్యర్థులకు సూచించారు. మంగళవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి, రిటైర్డు ఐఏఎస్ ఏ.ఎండి ఇంతియాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు, నాయకులకు భరోసా కల్పిస్తూ…. పార్టీ భవిష్యత్పై కార్యచరణ రూపొందిద్దామని ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేసినట్లు కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఏఎండి ఇంతియాజ్ తెలిపారు.
![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2024/06/836.jpg?resize=550%2C237&ssl=1)