PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కార్యకర్తలకు అండగా ఉందాం..

1 min read

అభ్యర్థులకు సూచించిన మాజీ సీఎం వైఎస్​ జగన్​

కర్నూలు, పల్లెవెలుగు: తాజా ఎన్నికల ఫలితాలతో తీవ్ర అసంతృప్తికి గురైన నాయకులు, కార్యకర్తలకు అండగా ఉందామని మాజీ సీఎం వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి అసెంబ్లీ అభ్యర్థులకు సూచించారు. మంగళవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి, రిటైర్డు ఐఏఎస్​ ఏ.ఎండి ఇంతియాజ్​ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు, నాయకులకు భరోసా కల్పిస్తూ…. పార్టీ భవిష్యత్​పై కార్యచరణ రూపొందిద్దామని ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి స్పష్టం చేసినట్లు కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఏఎండి ఇంతియాజ్​ తెలిపారు.

About Author