PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సమస్యలన్నీ పరిష్కరిస్తా..ఆశీర్వదించండి…

1 min read

ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి

ఆదోని, పల్లెవెలుగు: నియోజకవర్గంలోని గ్రామాల్లో తిష్ట వేసిన సమస్యలన్నీ పరిష్కరిస్తానని, తనను ఆశీర్వదించి … గెలిపించాలని అభ్యర్థించారు ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి. బుధవారం సాయంత్రం పెసలబండ, మాంత్రికి గ్రామాల్లో అభ్యర్థి డా. పార్థసారధితోపాటు టీడీపీ, జనసేన నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా డా.పార్థసారధి మాట్లాడుతూ పదైదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న సాయి ప్రసాద్​ రెడ్డి బెదిరింపులతో భూ కబ్జాలు, దందాలు చేశాడని, ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై బైండోవర్​ కేసులు నమోదు చేయించాడని, అలాంటి వ్యక్తికి మరో అవకాశం ఇస్తే ఆదోని అభివృద్ధిలో మరో 30 ఏళ్లు వెనుకబడుతుందన్నారు. ఆదోని అభివృద్ధి చెందాలన్నా… గ్రామాల పురోగతి కావాలన్నా కమలం గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో తనను గెలిపిస్తే గ్రామాల్లో రోడ్లు, తాగు,సాగునీటి సౌకర్యం, రోడ్లు, మురుగు కాల్వలు, వీధిలైట్లు తదితర సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, జనసేన నాయకులు మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

About Author