PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కూటమి అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలి

1 min read

జనసేన ఇన్చార్జ్ బి లక్ష్మన్న

పల్లెవెలుగు  వెబ్ మంత్రాలయం: ఈరోజు మంత్రాలయం కూటమి అభ్యర్థి మాధవరం రాఘవేంద్ర రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రాలయం జనసేన ఇన్చార్జ్ బి లక్ష్మన్న కోరారు.   కోసిగి మండలం లోని చిన్న బొంపల్లి, పెద్ద బొంపల్లి, ఐరన్ గల్లు, తుమ్మిగనూర్   గ్రామాలలో జనసేన, టిడిపి, బిజెపి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి   రాఘవేంద్ర రెడ్డి ని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో జనసేన పార్టీ ఇంచార్జ్ వాల్మీకి లక్ష్మణ టిడిపి నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు కార్యకర్తలు, బిజెపి నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.గ్రామాలలో జనసేన పార్టీ ఇన్చార్జి వాల్మీకి లక్ష్మణ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అభ్యర్థి  రాఘవేంద్ర రెడ్డి ని పెద్ద మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో జనసేన టిడిపి బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుందని  చంద్రబాబు నాయుడు  ముఖ్యమంత్రి కావడం ఖాయమని  ధీమా వ్యక్తం చేశారు. .తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ రాఘవేంద్ర రెడ్డి  మాట్లాడుతూ ప్రజా సమస్యలను తప్పకుండా తీరుస్తానని తాగునీరు సాగునీరు  రోడ్ల సమస్య తీరుస్తానని నన్ను గెలిపించండి అని కోరారు.గ్రామ గ్రామాన ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author