PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమ‌రావ‌తే రాజ‌ధాని..నిర్ధారించిన కేంద్రం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అమరావతినే ఏపీ రాజధానిగా నిర్ధారిస్తూ 2022-23 బడ్జెట్‌లో కేటాయింపులను కేంద్రం ప్రకటించింది. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి నిధులను కేంద్ర కేటాయించింది. ఏపీ నూతన రాజధాని అమరావతి పేరుతోనే బడ్జెట్‌లో ప్రొవిజన్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది. కేంద్ర బడ్జెట్‌లో పట్టణాభివృద్ధి శాఖ నుంచి అమరావతిలో సచివాలయం, ఉద్యోగుల నివాస గృహాల నిర్మాణానికి నిధులను కేటాయించారు. సచివాలయ నిర్మాణానికి రూ.1214 కోట్లను అంచనా వ్యయంగా కేంద్రం పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగుల నివాస గృహాల కోసం రూ. 1126 కోట్లను కేంద్రం అంచనా వేసింది. ఈ బడ్జెట్‌లో రూ. లక్షల రూపాయలను పట్టణాభివృద్ది శాఖ కేటాయించింది.

                                       

About Author