PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అనంతపురం … రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్ అనంతపురం:  అనంతపురం టౌన్ కు చెందిన నూర్ మొహమ్మద్ వయస్సు 23 సంవత్సరాలు తండ్రి చిన్న షేక్షావలి అను వ్యక్తి హైదరాబాద్ లోని ACCENTURE కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ, సదరు కంపెనీ వారు మూడు నెలలపాటు వర్క్ ఫ్రం హోం ఇచ్చినందున నూర్ మొహమ్మద్ తన స్వగ్రామమైన అనంతపురం టౌన్ కు ఈ దినం అనగా 16-10-2023వ తేదీన తెల్లవారుజామున 4-00 గంటలకు తన యొక్క మోటార్ సైకిల్ AP 39 SG 4397 లో హైదరాబాద్ నుండి బయలుదేరి ఎన్ హెచ్ 44 రోడ్డుపై అనంతపురం టౌన్ కు వెళుతూ ఉండగా మార్గమధ్యంలో ఉదయం సుమారు 6-50 గంటలకు తడకనపల్లె క్రాస్ వద్దకు వచ్చేసరికి పోతి తన మోటార్ సైకిల్ ను అతివేగంగా అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా నడుపుకుంటూ వస్తు తను నడుపుతున్న మోటార్ సైకిల్ ను కంట్రోల్ చేసుకోలేక ఎన్ హెచ్ 44 డివైడర్ ను ఢీ కొట్టడం వలన పోతీ మోటార్ సైకిల్ పై నుండి కిందపడి సుమారు 10 మీటర్లు ఈడ్చుకుంటూ వెళ్ళటం వలన పోతికి తలకు కుడివైపు చంక వద్ద బలమైన రక్త మరియు మూగ గాయాలై అక్కడికక్కడే చనిపోయినాడు అని పోతి తండ్రి షేక్ షేక్షావలి ఉలిందకొండ పిఎస్ కు వచ్చి ఫిర్యాదు ఇవ్వగా  ఉలిందకొండ పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడమైనది.

About Author