PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మల్లన్న భక్తులకు.. అన్నదానం

1 min read

కర్నూలు, పల్లెవెలుగు: ఉగాది పర్వదినం పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబమల్లికార్జున స్వామివార్లను దర్శించుకునేందుకు వెళ్తున్న పాదాచారుల(భక్తులు)కు సోమవారం పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. నగరంలోని గణేష్​ నగర్​లోని శివాలయంలో  పద్మశాలీ కుల బంధువులు విరాళం వేసుకుని… భక్తితో శ్రీశైలం వెళ్లే పాదాచారులకు  అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అన్నదానం ఏర్పాటు చేశారు.  అదేవిధంగా ఆపిల్​ హాస్పిటల్​ అధినేత డా. అచ్యుత్​ రావు నేతృత్వంలో భక్తులకు ఉచితంగా వైద్య పరీక్షల చేసి, మందులు పంపిణీ చేశారు.  కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన కుల బంధువులకు  కర్నూలు పద్మశాలీ సంఘం అధ్యక్షుడు కస్తూరి వేమయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీశైల మల్లన్న కృప ప్రతిఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మేడం సుంకన్న, గుర్రం శివప్రసాద్​, కస్తూరి ప్రసాద్​, జెరుబండి హరి ప్రసాద్​,లక్ష్మీనారాయణ, కె.గోవిందు తదితరులు పాల్గొన్నారు.

About Author