PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ రామయ్య యాదవ్ నామినేషన్​

1 min read

కర్నూలు, పల్లెవెలుగు: కర్నూలు అసెంబ్లీకి పోటీ చేస్తున్న జాతీయ సమ సమాజం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు యాదవ్ నామినేషన్ కార్యక్రమం దాదాపు వెయ్యి మంది కార్యకర్తలు, అభిమానులు, పార్టీ నాయకులు వెంట రాగా సి క్యాంపు నుండి కలెక్టరేట్, రాజు విహార్ పెద్ద పార్క్, ఓల్డ్ కంట్రోల్ రూమ్ మీదుగా కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్ వరకు జరిగిన ర్యాలీతో అట్టహాసంగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా రామయ్య యాదవ్ మాట్లాడుతూ కర్నూల్ నగర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, మా కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం రామయ్య యాదవును గెలిపించుకుంటామని స్వచ్ఛందంగా మద్దతు తెలియజేస్తున్నారని, అదేవిధంగా ప్రజా పలకరింపు యాత్రలో కూడా వారు చూపిన ఆదరణకు కృతజ్ఞుడనై, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటానని, కర్నూల్ నగర ప్రజలు చూపిస్తున్న అభిమానంతో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో జాతీయ సమజం పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన అన్నారు.

About Author