PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అర్జీదారుల సమస్యలను వెంటనే పరిష్కరించండి

1 min read

నగర పాలక సంస్థ కమిషనర్​ భార్గవ్​ తేజ ఐఏఎస్

  • పల్లెవెలుగు:  కర్నూలు నగర పరిధిలో అర్జీదారుల నుంచి వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు నగర పాలక సంస్థ కమిషనర్​ ఏ. భార్గవ తేజ ఐఏఎస్​. సోమవారం  మున్సిపల్​ కార్యాలయంలో నిర్వహించిన ‘ స్పందన ’ కార్యక్రమానికి వచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. స్పందనకు వచ్చిన అర్జీలలో కొన్ని సమస్యలు…

1. జొహరాపురం హౌసింగ్ బోర్డు కాలనీ కి చెందిన మహబూబ్ బాష మరియు ఇతరులు, వార్త ఆఫీస్ నుండి  హౌసింగ్ బోర్డుకు వెళ్ళే రోడ్డు పూర్తిగా పాడైపోయినదని, నడవటానికి కూడా వీలు లేకుండా ఉన్నదని,  కావున ఈ సమస్యను  వీలైనంత త్వరగా పరిష్కరించావలసినదిగా కమీషనర్ గారిని అభ్యర్దించారు.

2. ప్రకాష్ నగర్ కి చెందిన డా. రామా ప్రసన్న, తమ వీధి యందు ఏంతో కాలముగా డ్రైనేజీ సమస్య ఉన్నదని, కావున వీలైనంత త్వరగా ఆ సమస్య పరిష్కరించావలసినదిగా కమీషనర్ గారిని అభ్యర్దించారు.

3. రాయలసీమ గ్రామీణ బ్యాంకు ఎంప్లాయిస్ హౌసింగ్ సొసైటీ కి చెందినా శ్రీనివాస్ గారు మరియు ఇతరులు, తమ వీధిలోని ఖాళీ స్థలముల యందు రాజీవ్ గృహకల్ప మరియు డ్రైవర్స్ కాలనీ కి చెందిన మురుగు నీరు ప్రవేశించుట వలన దోమల బెడద మరియు ఆరోగ్య సమస్యలు అధికమవుతున్నవని, కావున  ఈ సమస్య వీలైనంత త్వరగా  పరిష్కరించావలసినదిగా కమీషనర్ ను అభ్యర్దించారు,

4.         మారుతి నగర్ కి చెందినా రామకృష్ణుడు మరియు ఇతరులు, తమ వీధి యందు   డ్రైనేజీ సమస్య ఉన్నదని, కావున వీలైనంత త్వరగా ఆ సమస్య పరిష్కరించావలసినదిగా కమీషనర్ ను అభ్యర్దించారు.

5.         చాణక్యపురి కాలనీ  కి చెందిన డా. దాసరి, తమ వీధి యందు   డ్రైనేజీ సమస్య ఉన్నదని, కావున వీలైనంత త్వరగా ఆ సమస్య పరిష్కరించావలసినదిగా కమీషనర్ ను అభ్యర్దించారు.

6.         ఎఫ్.సి.ఐ కాలనీ కి చెందిన శ్రీమతి మెహమూద బేగం మరియు ఇతరులు తమ వీధి యందు రోడ్డు పరిస్థితి సరిగా లేదని, కావున వీలైనంత త్వరగా  రోడ్డు రిపైరీ చేయించవలసినదిగా కమీషనర్ ను అభ్యర్దించారు

7.         ఫోర్త్ క్లాసు ఎంప్లాయిస్ కాలనీ కి చెందిన శ్రీ రాజన్న  మరియు ఇతరులు తమ కాలనీ నుండి శ్రీరామ నగర్ ని కలుపుతూ దారి ఏర్పాటు చేయవలసినదిగా కమీషనర్ ను  అభ్యర్దించారు

8.         పాత కర్నూలు కి చెందిన శ్రీ నూర్ అహమ్మద్ , గతంలో తాము టిడ్కో ఇంటికోసము ప్రభుత్వ నిర్ణీత రుసుము కట్టియున్నామని, కాని తరువాత కట్టవలసిన రుసుములు తాము కట్టలేమని, కావున తమ కేటాయిoపుని రద్దు చేసి గతములో

తాము కట్టిన రుసుము తమకు తిరిగి ఇవ్వవలసినదిగా కమీషనర్ ను అభ్యర్దించారు.

స్పందన కార్యక్రమంలో అదనపు కమీషనర్ శ్రీ. రామలింగేస్వర్, ఎస్.ఈ. వేణుగోపాల్, సిటీ ప్లానర్ మీనా కుమారి మరియు ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

About Author