PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రశాంతంగా ఏపీపీఎస్సీ గ్రూప్- 1 పరీక్షలు

1 min read

జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : జిల్లాలో ఏపీపీఎస్సీ గ్రూప్- 1 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పేర్కొన్నారు.ఆదివారం కర్నూలు నగరంలోని సుంకేసుల రోడ్డు సెయింట్ జోసెఫ్ కాలేజీ, మరియు ఏ క్యాంప్  మాంటేసరి స్కూల్ లలో  నిర్వహిస్తున్న ఏపీపిఎస్సి గ్రూప్- 1 పరీక్షా కేంద్రాలను  జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆదివారం ఉదయం 10.00 గంటల నుంచి 12:00 గంటల వరకు గ్రూప్- 1పరీక్షలు పేపర్ -1, మధ్యాహ్నం 2.00 నుండి 4.00 వరకు పేపర్-2 నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలో 31 పరీక్షా కేంద్రాల్లో గ్రూప్-1 పరీక్షలు నిర్వహించడం జరిగిందని, ఉదయం జరిగిన గ్రూప్- 1పరీక్షలు పేపర్ -1 పరీక్షకు 11384 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా, 7340 మంది విద్యార్థులు హాజరైనారు అని అన్నారు.మధ్యాహ్నం 2.00 నుండి 4.00 వరకు పేపర్-2 పరీక్షలు నిర్వహించడం జరిగిందని పేపర్ -2 పరీక్షలకు11384 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 7286 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు అని అన్నారు.పేపర్ -1 పరీక్షకు 64.48 శాతం విద్యార్థులు,పేపర్-2 పరీక్షలకు 64.శాతం విద్యార్థులు హాజరైనారని తెలిపారు.జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా, ప్రశాంతంగా పరీక్షలు ముగిశాయని జాయింట్ కలెక్టర్ తెలిపారు.

About Author