PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అసైన్డ్​భూమి.. పట్టాగా మార్చి..!

1 min read

వైసీపీ నేతల అండ… రెవెన్యూ అధికారుల కక్కుర్తి…

  • సర్వే నంబరు 608/హెచ్​ ను… 777/1 గా మార్చి…
  • రూ. వంద కోట్లు విలువ చేసే పేదల భూమిని… ‘డీఆర్​సీ’ విక్రయం
  • భూ కబ్జాకు కేరాఫ్​… డీఆర్​సీ బిల్డింగ్​ అండ్​ ఇన్​ఫ్రాస్టక్చర్​
  • అక్రమ లే అవుట్లతో కోట్లు కొల్లగొట్టిన ‘ శ్రీహరి ఆక్సిజన్​ సిటీ ’
  • విచారణ జరిపితే… వాస్తవాలు వెలుగులోకి వస్తాయి..
  • బీజేపీ సీనియర్​ నాయకుడు బై రెడ్డి రాజశేఖర్​ రెడ్డి

కర్నూలు, పల్లెవెలుగు:వైసీపీ నాయకుల అండ దండలు… రెవెన్యూ, రిజిస్ర్టార్​ అధికారుల కక్కుర్తి కారణంగా నగరంలోని డీఆర్​సీ బిల్డింగ్​ అండ్​ ఇన్​ఫ్రా స్ట్రక్చర్​ యాజమాన్యం  ప్రభుత్వ భూమిని సులువుగా కొట్టేసి… కోట్లు కొల్లగొట్టారని తీవ్రంగా ఆరోపించారు బీజేపీ సీనియర్​ నాయకులు బై రెడ్డి రాజశేఖర్​ రెడ్డి.  ఏకంగా సర్వే నెంబర్లు మార్చి… విల్లాలుగా అమ్మేసి… వంద కోట్లకు పైగా సొమ్ము చేసుకున్న డీఆర్​సీ యాజమాన్యం ..మరో వంద కోట్లు కొల్లగొట్టేందుకు … ప్రయత్నాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం బైరెడ్డి కాంప్లెక్స్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బై రెడ్డి రాజశేఖర్​ రెడ్డి మాట్లాడారు. అసైన్డ్​ భూమి సర్వే నెంబరు 608/ హెచ్​ ను అప్పటి సర్వేయర్ , తహసీల్దార్​ కు లంఛాలు ఇచ్చి.. ఏకంగా సర్వే నెంబరును మార్చారు. 608 /హెచ్​ ను సర్వే నెంబరు ( కొత్త నెంబరు) 777/1 సిగా రికార్డులలో మార్చి… పెద్ద పెద్ద భవనాలు నిర్మించి.. వంద కోట్లకు పైగా సొమ్ము చేసుకున్నాడని ఆయన వెల్లడించారు.

రికార్డులు మార్చి… విల్లాలుగా అమ్మేసి…

వైసీపీ ప్రభుత్వ హయాంలో డీఆర్​సీ బిల్డింగ్​ అండ్​ ఇన్​ ఫ్రాస్ర్టక్చర్​ యాజమాన్యం  భూ కబ్జాలకు కేరాఫ్​ గా మారిందని ఘాటుగా విమర్శించారు బై రెడ్డి రాజశేఖర్​ రెడ్డి. 2020లో కర్నూలు రూరల్​ తహసీల్దార్​ ​, సర్వేయర్​ డబ్బులకు కక్కుర్తి పడి… రుద్రవరం గ్రామంలోని  ప్రభుత్వ భూమి సర్వే నెంబరు 608/ హెచ్​ ను సర్వే నెంబరు (కొత్తది) 777/1, 777/1సి, 1బి అడంగల్​ ఆర్ ఓఆర్ లో పట్టా భూమిగా మార్చారు. ఇదే సర్వే నెంబరులో  ఎకరాలు 360.51  సెంట్లకు పైగా ప్రభుత్వ భూమి గా చాలా మంది రైతులకు అమ్ముకోడానికి వీలులేకుండా నిషేధిత జాబితాలో ఉంచారు. కానీ సదరు తహసీల్దారు, సర్వేయర్లు రియల్​ ఎస్టేట్​ వ్యాపారి డీఆర్​సీ యాజమాన్యంతో భారీ మొత్తంలో లంఛాలు తీసుకొని… పట్టా భూమిగా మార్చి.. రిజిస్టర్లు చేయించారు. ఇందులో అప్పటి సబ్​ రిజిస్టరు కూడా  ఆమ్యామ్యాలు తీసుకుని.. చేసి ఉంటాడని ఆయన ఆరోపించారు.

ప్రజలను..ప్రభుత్వాన్ని మోసం చేసిన ‘డీఆర్​సీ’

ప్రభుత్వ అసైన్డ్​ భూమిని… పట్టాభూమిగా మార్చి… అటు ప్రభుత్వాన్ని… ఇటు బిల్డింగ్​ కొనుగోలు దారులను దారుణంగా మోసం చేసిన ‘డీఆర్​ సీ ’ యాజమాన్యంపై సీబీఐ విచారణ జరపాలని బీజేపీ సీనియర్​ నాయకుడు బై రెడ్డి రాజశేఖర్​ రెడ్డి డిమాండ్​ చేశారు. రుద్రవరం గ్రామపంచాయతీ పరిధిలోని సర్వేనెంబరు 608/ హెచ్​ను  పేదల నుంచి కొనుగోలు చేసి…  సర్వే నెంబరు 777/1, 777/1సీ,1బి గా మార్చేశారని, ఆ తరువాత గ్రామపంచాయతీ నుంచి అప్రూవల్​ తీసుకొని ..భవనాలు నిర్మించి విక్రయించారని స్పష్టంగా వివరించారు. ప్రభుత్వం దృష్టిలో పేదల భూమి (అసైన్డ్​ భూమి)గా ఉంటుందని, కానీ సర్వే నెంబరు మార్చి పట్టాభూమిగా మార్చి.. విల్లాలు కట్టి.. రిజిస్టర్లు చేశారని వెల్లడించారు. అటు కొనుగోలుదారులను… ఇటు ప్రభుత్వాన్ని నిలువునా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరో వంద కోట్లకు… ప్లాన్​…

పాత సర్వే నెంబరు 608/హెచ్​ పైభాగంలో మరో కొత్త సర్వే నెంబరు 778/1, 778/3,778/4 లో మొత్తం ఎకరములు 3.69 సెంట్లు రివైజ్​ కాబడిన సర్వే నెంబర్లతో అదే తప్పుడు మార్గాన .. అక్రమ లే అవుట్​ వేసి మరో వంద కోట్ల రూపాయలు అక్రమార్జనకు డీఆర్​సీ యజమని కుట్ర పన్నాడని బై రెడ్డి రాజశేఖర్​ రెడ్డి ధ్వజమెత్తాడు.  అనుమతి లేకపోయినా బిల్డింగ్​ లు నిర్మించి… విక్రయిస్తున్నాడని, వీటిని కొనుగోలు చేసిన ప్రజలు మోసపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సర్వే నెంబర్లు మార్చి విక్రయించిన డీఆర్​సీ యజమానిపై, ఇందుకు సహకరించిన తహసీల్దారు ​, సర్వేయర్​ పై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే … వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడును త్వరలో కలుస్తానని ఈ సందర్భంగా బై రెడ్డి రాజశేఖర్​ రెడ్డి వెల్లడించారు.  కొనుగోలుదారులను.. ప్రభుత్వాన్ని మోసం చేసిన డీఆర్​ సీ యాజమాన్యంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, శ్రీహరి ఆక్సిజన్​ సిటీలో భవనాలు కొనుగోలు చేసిన వారికి , పేదలకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బై రెడ్డి రాజశేఖర్​ రెడ్డి డిమాండ్​ చేశారు.

About Author