PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హిందూ బాలిక పై దారుణం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పాకిస్థాన్ దేశంలో మరో దారుణం తాజాగా వెలుగుచూసింది. ఉచితంగా రేషన్ ఇస్తామని ఆశపెట్ ఓ హిందూ మైనర్ బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి మత్తుమందు ఇచ్చి ఆమెపై సామూహిక అత్యాచారం జరిపిన దారుణ ఘటన జరిగింది. పాక్ దేశంలోని సింధ్ ప్రావిన్సు పరిధిలో ఉన్న సంఘార్ జిల్లా షహదాద్ పూర్ గ్రామానికి చెందిన 13 ఏళ్ల హిందూ బాలిక కూరగాయలు కొనేందుకు మార్కెటుకు వచ్చింది. అదే గ్రామానికి చెందిన ఖాలిద్ మాషి, బర్షేక్ మాషీలనే ఇద్దరు యువకులు బాలికకు ఉచితంగా రేషన్ ఇస్తామంటూ చెప్పి గ్రామం బయట నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లారు. మత్తుమందు కలిపిన పానీయాన్ని బాలికతో తాగించి ఇద్దరు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.

                                    

About Author