PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కుప్పం వైసీపీ ఎమ్మెల్సీ పీఏ పై దాడి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ పీఏపై కుప్పంలో దాడి జరిగింది. సొంత పార్టీవారే దాడి చేయడంతో.. ఒళ్లంతా రక్తగాయాలతో ఎమ్మెల్సీ పీఏ మురుగేశ్‌ ఆసుపత్రి పాలైనా దీనిపై బాధిత వర్గం మౌనం పాటిస్తోంది. నెత్తురోడుతున్న మురుగేష్‌ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కుప్పం వైసీపీ వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలో కుప్పంలోని ఓ లాడ్జీలో బుధవారం రాత్రి ఆయా వర్గాలకు చెందిన నాయకులు, వారి అనుచరులతో సమావేశమయ్యారు. మద్యం మత్తులో వారి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసిందంటున్నారు. మురుగే్‌షపై ఒక వర్గంవారు మారణాయుధాలతో దాడి చేశారని తెలుస్తోంది. ఈ దాడిలో ఆయన తల వెనుక గాయమై రక్తం కారింది. ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఒక ప్రముఖ నాయకుడి నుంచి ఫోన్‌ రావడంతో వివరాలు చెప్పేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు.

                              

About Author