PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో పాన్, గుట్కా నిషేధం

1 min read

పల్లెవెలుగు వెబ్​:ఏపీ ప్రభుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యానికి హానిక‌లిగించే పాన్, గుట్కా లాంటి ప‌ధార్థాల‌ను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం ఈరోజు నుంచి ఏడాది వ‌ర‌కు అమ‌లులో ఉంటుంది. గుట్కా, పాన్ మ‌సాలా, న‌మిలే పొగాకు ప‌దార్థాల త‌యారీ, పంపిణీ విక్రయాల‌ను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ మేర‌కు ఆహార ప‌రిర‌క్షణ శాఖ క‌మీష‌న‌ర్ భాస్కర్ కాటంనేని ఓ ప్రక‌ట‌న‌లో తెలిపారు. అయితే.. పాన్, గుట్కా నిషేధం ఏడాది వ‌ర‌కే ఎందుకున్న విష‌యంలో స్పష్టత లేదు.

About Author