PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించండి–ఆర్థర్

1 min read

పల్లెవెలుగు వెబ్  మిడుతూరు: ఈనెల 13న జరిగే ఎన్నికల్లో నన్ను రెండోసారి ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించాలని నందికొట్కూరు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోగూరు ఆర్థర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో గ్రామ గ్రామాన తిరుగుతూ దూసుకెళ్తున్నారు. మంగళవారం సాయంత్రం మిడుతూరు మండలంలోని సుంకేసుల,తిమ్మాపురం, బైరాపురం,చెరుకుచెర్ల గ్రామాల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు.ఇంతవరకు మీరు అన్ని పార్టీలను చూశారు.కానీ గ్రామాల్లో అభివృద్ధి అనేది కనిపించడం లేదని పంటల్లో రైతన్నలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడిపోతున్నా పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మన జీవితాలు బాగుపడతాయని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు ఉంటుందని విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య తదితర వాటి గురించి ఆయన ప్రజలకు వివరించారు.మీ అమూల్యమైన ఓటుతో నన్ను గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కొట్కూరు రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు నాగ మధు యాదవ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు వాడాల త్యాగరాజు,సుంకేసుల వెంకట్, ఇనాయతుల్ల,జాన్, ఏసుదాసు,తమ్మడపల్లె ఫ్రాన్సిస్,అర్లప్ప తదితరులు పాల్గొన్నారు.

About Author