PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నవరత్నాల రూపకర్తను ఆశీర్వదించండి

1 min read

– ఎమ్మెల్యే రవి రెడ్డిని ఆదరించండి

– కొండపేట ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నవైస్సార్సీపీ నాయకులు

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : నవరత్నాల రూపకర్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిందని,ప్రతి కుటుంభం లో మేలు జరిగివుంటేనే మళ్ళీ వైస్సార్సీపీ కి పట్టం కట్టాలని,, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ రామన శ్రీలక్ష్మి, సర్పంచ్ తుంగ చంద్రశేఖర్ యాదవ్ లు అన్నారు, బుధవారం మండల వ్యాప్తంగా వైస్సార్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు,ఈసందర్భంగా మండలం లోని కొండపేట గ్రామపంచాయతీలో సర్పంచ్ తుంగ చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తో కలసి వారు ఇంటింటికి వెళ్లి ఆఇంటికి జరిగిన మేలును వచ్చిన సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని వైస్సార్సీపీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు, ఈసారి మీరు ఆశీర్వదించి గెలిపిస్తే వైయస్ జగన్మోహన్ రెడ్డి40ఏండ్లుముఖ్యమంత్రిగాఉంటారనితెలిపారు,అలాగే ఎంఎల్ఏ రవీంద్ర నాద రెడ్డి కమలాపురం నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి పధంలో నడిపి అందరికి అందుబాటులో ఉంటు ఏసమస్య ఉన్న ఆయన దృష్టికి తీసుకెళితే ఆయన వెంటనే స్పందించి ఆయా పనులను త్వరగతిన పరిష్కరించడం జరుగుతుందన్నారు, ఆయనను మండల ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు,ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ఎంపీటీసీ నాగిరెడ్డి, మండల కో కన్వీనర్ శ్రీనివాసులు రెడ్డి, మాజీ ఎంపిటిసి భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ నాయకులు డి. కిరణ్, వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author