PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నందమూరి బాలక్రిష్ణ పుట్టిన రోజు సందర్భంగా రక్త దానం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  హిందూపురం హ్యాట్రిక్ ఎం.ఎల్.ఏ, తెలుగుచలన చిత్ర నటులు, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ శ్రీ నందమూరి బాలక్రిష్ణ పుట్టిన రోజు సంధర్బంగా ఎన్.బి.కె ఫ్యాన్స్ అసోసియేషన్ సేవా సమితి పేరపోగు రాజు, లతీఫ్, ఆర్య శంకర్ల ఆధ్వర్యంలొ కర్నూలు నగరంలోని విశ్వభారతి డయాగ్నస్టిక్ సెంటర్ నందు రక్త దాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి తెలుగుదేశంపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఎర్రసాని నాగేశ్వరరావు యాదవ్ లు ముఖ్యులుగా హాజరు కావడమైనది.  అనంతరం అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేయడమైనది.  ఈ కార్యక్రమంలో తెలుగుదేశంపార్టీ నాయకులు శ్రీయుతులు పి.హనుమంతరావు చౌదరి, పేరపోగు మారెన్న, కాసన మహేష్ గౌడ్ మొదలగు వారు పాల్గొన్నారు.

About Author