వెంకయ్యనాయుడు ట్విట్టర్ అకౌంట్లో బ్లూటిక్ తొలగింపు..!
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2021/06/8web050621.jpg?fit=550%2C416&ssl=1)
పల్లెవెలుగు వెబ్: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ అకౌంట్ నుంచి బ్లూటిక్ ను తొలగించింది. గత ఆరు నెలల నుంచి ఆయన ట్విట్టర్ అకౌంట్ ఇనాక్టివ్ గా ఉండటం వల్లనే తొలగించినట్టు సమాచారం. ఈ ట్విట్టర్ అకౌంట్ నుంచి 2020 జులై 23 నుంచి ఆయన చివరిసారిగా ట్వీట్ చేశారు. అయితే ఉపరాష్ట్రపతి అధికారిక ట్వీట్టర్ అకౌంట్ నుంచి మాత్రం బ్లూటిక్ ను తొలగించలేదు.