PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

9వ వార్డులో.. ఇంతియాజ్​కు బ్రహ్మరథం..

1 min read

ఫ్యాన్​ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థన

కర్నూలు, పల్లెవెలుగు:ఇంటింటికి ఇంతియాజ్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని తొమ్మిదవ వార్డులో కర్నూలు నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ A.Md. ఇంతియాజ్ మరియు కర్నూలు మాజీ ఎమ్మెల్యే SV మోహన్ రెడ్డి, వైసిపి నాయకులు మొహిద్ ఖాన్ , వైసిపి కార్పొరేటర్లు నాయకులు మరియు కార్యకర్తలు పాలుపంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని వారికి తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికలు అయిన వెంటనే వార్డులోని సమస్యలను త్వరగా పరిష్కరిస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది.

About Author