9వ వార్డులో.. ఇంతియాజ్కు బ్రహ్మరథం..
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2024/04/613.jpg?fit=550%2C367&ssl=1)
ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థన
కర్నూలు, పల్లెవెలుగు:ఇంటింటికి ఇంతియాజ్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని తొమ్మిదవ వార్డులో కర్నూలు నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ A.Md. ఇంతియాజ్ మరియు కర్నూలు మాజీ ఎమ్మెల్యే SV మోహన్ రెడ్డి, వైసిపి నాయకులు మొహిద్ ఖాన్ , వైసిపి కార్పొరేటర్లు నాయకులు మరియు కార్యకర్తలు పాలుపంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని వారికి తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికలు అయిన వెంటనే వార్డులోని సమస్యలను త్వరగా పరిష్కరిస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది.
![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2024/04/614.jpg?resize=550%2C367&ssl=1)