PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గోరేటి వెంక‌న్న‌కు కేంద్ర‌సాహిత్య అకాడ‌మీ అవార్డు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్రుమ‌ఖ వాగ్గేయ‌కారుడు గోరేటి వెంక‌న్న‌ను కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డు వ‌రించింది. ‘వల్లంకి తాళం’ కవితా గేయ రచనకు వెంకన్నకు అవార్డు ఇచ్చారు. 2021 సంవత్సరానికి గానూ కవిత్వ విభాగంలో వెంకన్నకు కేంద్ర సాహిత్య అవార్టు లభించింది. ఈ అవార్డు కింద ఆయనకు ప్రశంసా పత్రంతో పాటు లక్ష రూపాయలు నగదు ఇస్తారు. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రతి ఏటా 20 భారతీయ భాషల్లో ప్రాచుర్యం పొందిన సాహిత్యానికి అవార్డులు ప్రకటించడం ఆనావాయితీ వస్తోంది. 2016లో తెలంగాణ ప్రభుత్వం వెంకన్నకు కాళోజీ పురస్కారం అందించింది.

                                          

About Author