PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లెవెలుగు వెబ్​ : ట‌మోట ధ‌ర‌లు మ‌రోసారి ఆకాశాన్నంటాయి. త‌మిళ‌నాడులోని చెన్నైలో కిలో 100 రూపాయ‌లు దాటింది. ఆంధ్ర‌, క‌ర్ణాట‌క‌, కృష్ణగిరి ప్రాంతాల నుంచి ట‌మోట దిగుబ‌డి త‌గ్గడంతో ధ‌ర‌లు పెరిగాయ‌ని వ్యాపారులు చెబుతున్నారు. కోయంబేడు మార్కెట్లో మొదటి రకం టమోటా కిలో రూ.90, రెండవ రకం రూ.80కి విక్రయమవుతోంది. ఇక, చిల్లర వ్యాపారులు మొదటి రకం రూ.100 నుంచి రూ.110, రెండవ రకం రూ.90కి విక్రయిస్తున్నారు. ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు పెద్ద ఎత్తున ట‌మెట పంట దెబ్బ‌తింది. భారీగా దిగుబ‌డి త‌గ్గింది. ఈ నేప‌థ్యంలో ధ‌రలు పెరిగాయి.

About Author