PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మార్పువచ్చింది..గెలిపించండి..

1 min read

గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా

  • ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి

ఆదోని, పల్లెవెలుగు:కర్నూలు జిల్లాలోనే వెనుకడిన ప్రాంతమైన ఆదోని నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే….తనకు ఓటు వేసి గెలిపించాలని  కూటమి (బీజేపీ–జనసేన–టీడీపీ)అభ్యర్థి డా. పార్థసారధి ప్రజలను కోరారు. శనివారం సాంబగల్​, బైచిగేరి గ్రామాల్లో ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి డా. పార్థసారధి మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తాగునీరు ప్రధాన సమస్యగా ఉందని, కొన్ని గ్రామాల్లో రోడ్లు, కాల్వలు కూడా లేవని  ఆయా గ్రామాల ప్రజలు తన వద్ద మొర పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రజల సమస్యలను దగ్గరుండి విన్నానని, అన్నీ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డి గ్రామాల అభివృద్ధి గురించి పట్టించుకోలేదని, ధనార్జనే ధ్యేయంగా భూకబ్జాలు, రేషన్​, లిక్కర్​ మాఫియా, మట్కా , పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలను పెంచిపోషించారని ఆరోపించారు. పదైదేళ్లుగా సాయి ప్రసాద్​ రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే జరగని అభివృద్ధి… తనకు ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే అభివృద్ధి ఏమిటో చేసి చూపెడతానని ఈ సందర్భంగా డా.పార్థసారధి వెల్లడించారు. కమలం గుర్తుకు ఓటు వేసి వేయించి.. గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో టీడీపీ ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, సీనియర్​ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ, మదిరె భాస్కర్​, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author