PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బోఫ్ ఆద్వర్యంలో చిన్నారులకు ఏలూరు జిల్లా చెస్ ఫెస్టివల్..

1 min read

గెలుపొందిన విద్యార్థులకు పలువురు అభినందనలు..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : చిన్నారులకు ఏలూరు జిల్లా చెస్ ఫెస్టివల్ బహుజన ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (బోఫ్) తరుపున ఆదివారం ఏలూరు జిల్లా స్థాయి చెస్ ఫెస్టివల్ నిర్వహించబడింది. ఈ ఫెస్టివల్ను  ఏలూరు  సత్రంపాడు సిద్ధార్థ స్కూల్లో అండర్ 15  కోటాలో పలు ఉప విభాగాల్లో నిర్వహించడమైనది.అర్బిటర్గా ప్రముఖ చెస్ కోచ్ యోహనన్, ఫెస్టివల్ ఆర్గనైజర్ గా అరుణ కుమారి వ్యవహరించారు.చెస్ ఫెస్టివల్ని  సిద్ధార్థ   స్కూల్ ప్రిన్సిపాల్ కుమార్ ప్రారంభించారు.నేడు ప్రపంచ్యాప్తంగా 61 కోట్ల మంది ప్రతి రోజు చెస్ ఆడుతున్నారని కుమార్చెప్పారు.ఇది మేథోపరమైన  ఆటని, ఐక్యూ ని బాగా పెంచుకోవచ్చని, ఒక చిన్న అకాడమీ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి ఛాంపియన్ వరకు ఎదగవచ్చని  వివరించారు. ఈ కార్యక్రమానికిముఖ్య అతిథిగా హాజరైన బోఫ్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర్లు విచ్చేసి మాట్లాడుతూ చదరంగం భారత దేశంలో రూపుదిద్దుకున్న ఆటని అన్నారు.16 వ శతాబ్దం నుంచి క్రమబద్ధమైన చెస్ టోర్నమెంట్ లు భారతదేశంలో నిర్వహించబడుతున్నాయని అన్నారు.ప్రత్యేక ముఖ్య అతిథిగా యూనియన్ బ్యాంక్ అధికారి దుర్గాప్రసాద్ హాజరై మాట్లాడుతూ చదరంగం క్రీడాకారులు అన్ని రంగాలతో పాటు ఆర్థికంగా కూడా  స్తితిమంతులు కావచ్చని తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థులకు గౌరవప్రదమైన పేరు,ప్రఖ్యాతులు, కీర్తి  ప్రతిష్ఠలు సాధించవచ్చన్నారు.సమాఖ్య నాయకులు ఎం. వసంత్ కుమార్ మాట్లాడుతూ బహుజన అధికారులు మరియు ఉద్యోగుల సమాఖ్య ద్వారా త్వరలో చెస్ ప్లేయర్స్ అండ్ పేరెంట్స్ వింగ్ ప్రారింబిస్తున్నామన్నారు.ఆసక్తి కలిగినవారు మేధాశక్తిని పెంపొందించుకోవడానికి ఇ ఫోన్ నెంబర్ 94405 39808 ద్వారా సంప్రదించవచ్చుని తెలిపారు. నెలకు రెండు టోర్నమెంట్స్  చొప్పున జిల్లా స్థాయి , రాష్ట్ర స్థాయి టోర్నమెంట్స్ నిర్వహించడంతో పాటు ఛాంపియన్ కోచ్స్ చే ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.ఆటలో విజేతలుగా నిలిచిన  చిన్నారులకు మెడల్స్ , మేమెంటోస్,మెరిట్ / ప్రశంసా పత్రాలను బహూకరించారు.విజేతల జాబితా ప్రకారంఅండర్ 15 టాప్ 5 లోజి.అభిషేక్ అవ్రహాం, సిహెచ్.వివేక్, జి.అనురూప్ మోషే, బి.వియాన్ రాజ్, టి.నవనీత్; అండర్ సెవెన్ బాలుర విభాగంలోప్రశాంత్ ;అండర్ నైన్ విభాగంలో మరియరాజు; అండర్ 11 విభాగంలోడి జస్వంత్ , దేవరకొండ ఎల్వీ విజ్ఞాన్ భరత్ ;అండర్ 13 విభాగంలో  తన్మయ్  సాయి, ;అండర్ 15 విభాగంలో  ఎం.విక్రాంత్;బాలికల విభాగంలో అండర్ నైన్ ఎన్. నిత్య;అండర్ 11 విభాగంలో  వేదశ్రీ; కన్సోలేషన్ ప్రైజ్లలో ప్రణయ్ రోషన్, మోనిష్ ,స్టీఫెన్, చిరస్మి ,సోనాక్షి ,తదితరులు విజేతలుగా నిలిచారు.పలువురు అభినందనలు.బహుజన ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (బోఫ్) తరుపున ఆదివారం ఏలూరు జిల్లా స్థాయి చెస్ ఫెస్టివల్ నిర్వహించబడింది.  సత్రంపాడు సిద్ధార్థ స్కూల్లో అండర్ 15  కోటాలో పలు ఉప విభాగాల్లో ఆదివారం నిర్వహించడమైనది.అర్బిటర్గా ప్రముఖ చెస్ కోచ్ యోహనన్, ఫెస్టివల్ ఆర్గనైజర్ గా అరుణ కుమారి వ్యవహరించారు.చెస్ ఫెస్టివల్ని  సిద్ధార్థ   స్కూల్ ప్రిన్సిపాల్ కుమార్ ప్రారంభించారు.

నేడు ప్రపంచ్యాప్తంగా 61 కోట్ల మంది ప్రతి రోజు చెస్ ఆడుతున్నారని కుమార్చెప్పారు.ఇది మేథోపరమైన  ఆటని, ఐక్యూ ని బాగా పెంచుకోవచ్చని, ఒక చిన్న అకాడమీ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి ఛాంపియన్ వరకు ఎదగవచ్చని  వివరించారు.ముఖ్య అతిథిగా హాజరైన బోఫ్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చదరంగం భారత దేశంలో రూపుదిద్దుకున్న అతి పురాతన ఆటని అన్నారు.16 వ శతాబ్దం నుంచి క్రమబద్ధమైన చెస్ టోర్నమెంట్ లు భారతదేశంలో నిర్వహించబడుతున్నాయని అన్నారు.ప్రత్యేక ముఖ్య అతిథిగా యూనియన్ బ్యాంక్ అధికారి దుర్గాప్రసాద్ హాజరై చదరంగం క్రీడాకారులు అన్ని రంగాలతో మేధాశక్తితో పాటు ఆర్థికంగా కూడా  స్తితిమంతులు కావచ్చు అని తెలిపారు. గౌరవప్రదమైన

 పేరు – ప్రఖ్యాతులు , కీర్తి – ప్రతిష్ఠలు సాధించవచ్చన్నారు.

సమాఖ్య నాయకులు ఎం. వసంత్ కుమార్ మాట్లాడుతూ

బహుజన అధికారులు మరియు ఉద్యోగుల సమాఖ్య ద్వారా త్వరలో చెస్ ప్లేయర్స్ అండ్ పేరెంట్స్ వింగ్ ప్రారింబిస్తున్నామన్నారు.ఆసక్తి కలిగినవారు ఫోన్ నెంబర్ 94405 39808 ద్వారా సంప్రదించవచ్చుని తెలిపారు. నెలకు రెండు టోర్నమెంట్స్  చొప్పున జిల్లా స్థాయి , రాష్ట్ర స్థాయి టోర్నమెంట్స్ నిర్వహించడంతో పాటు ఛాంపియన్ కోచ్స్ చే ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఆటలో విజేతలుగా నిలిచిన  చిన్నారులకు

మెడల్స్ , మేమెంటోస్,మెరిట్ / ప్రశంసా పత్రాలను బహూకరించారు.విజేతల జాబితా ప్రకారం

అండర్ 15 టాప్ 5 లోజి.అభిషేక్ అవ్రహాం, సిహెచ్.వివేక్, జి.అనురూప్ మోషే,

 బి.వియాన్ రాజ్, టి.నవనీత్; అండర్ సెవెన్ బాలుర విభాగంలో

ప్రశాంత్ ;అండర్ నైన్ విభాగంలో మరియరాజు; అండర్ 11 విభాగంలో

డి జస్వంత్ , దేవరకొండ ఎల్వీ విజ్ఞాన్ భరత్ ;అండర్ 13 విభాగంలో 

తన్మయ్  సాయి, అండర్ 15 విభాగంలో 

ఎం.విక్రాంత్ ,బాలికల విభాగంలో అండర్ నైన్ ఎన్. నిత్య;అండర్ 11 విభాగంలో 

వేదశ్రీ; కన్సోలేషన్ ప్రైజ్లలో ప్రణయ్ రోషన్, మోనిష్ ,స్టీఫెన్, చిరస్మి ,సోనాక్షి ,తదితరులు విజేతలుగా నిలిచారు. విచ్చేసిన పలువురిని అభినందనలు తెలియజేశారు.

About Author