PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భవిష్యత్​ కార్యచరణపై.. మాజీ సీఎంతో చర్చ..

1 min read

కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ ఖాన్​

కర్నూలు, పల్లెవెలుగు: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు నిరాశకు గురి చేయడంతో …భవిష్యత్​ కార్యచరణపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డితో చర్చించినట్లు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​ తెలిపారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎంను మాజీ ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ ఖాన్​ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిస్థితులు, కార్యకర్తలకు ఇవ్వాల్సిన భరోసా తదితర అంశాలపై మాజీ సీఎంతో చర్చించినట్లు ఏంఎ హఫీజ్​ఖాన్​ సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.

About Author