PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బూత్ కమిటీలను  త్వరగా పూర్తి చేయండి

1 min read

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు    కే బాబురావు  

పల్లెవెలుగు వెబ్ కర్నూలు  :   బూత్ కమిటీలను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కే బాబురావు  తెలియజేశారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కర్నూలు నగర కాంగ్రెస్ నాయకుల సమావేశంలో బాబురావు  మాట్లాడుతూ జిల్లాస్థాయిలో పోలింగ్ బూత్ లో వారీగా బూత్ కమిటీలు పూర్తి చేయాలని ఒక్కొక్క పోలింగ్ బూత్ కు ఇద్దరేసి చొప్పున వారి పేరు సెల్ నెంబర్లు త్వరగా పూర్తిచేసి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయమునకు పంపాలని, ఆయా నియోజకవర్గాల ఇన్చార్జీలు, కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, స్థానిక కాంగ్రెస్ నాయకుల సమన్వయంతో కమిటీలు పూర్తి చేయాలని తెలియజేశారు. ఈ సమావేశంలో కర్నూలు నగర కాంగ్రెస్ అధ్యక్షులు జాన్ విల్సన్, డిసిసి ఉపాధ్యక్షులు బి బతకన్న కే వెంకటరెడ్డి, సయ్యద్ రియాజుద్దీన్, డిసిసి ప్రధాన కార్యదర్శులు పోతుల శేఖర్, భరత్ కుమార్ ఆచారి, కె సత్యనారాయణ గుప్త, ఎన్ చంద్రశేఖర్, షేక్ నవీద్ రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు కొత్తపేట మున్న, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఈ లాజరస్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎస్ ప్రమీల, జిల్లా మహిళా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షురాలు ఏ వెంకట సుజాత, సిటీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ ఖాజా హుస్సేన్, డిసిసి కార్యదర్శులు ఏజాస్ అహ్మద్, బి సుబ్రహ్మణ్యం అబ్దుల్ హై, మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఖాద్రి పాషా కాంగ్రెస్ నాయకులు షేక్ మాలిక్ భాష మొదలగు వారు పాల్గొన్నారు.

About Author