PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీ హైకోర్టు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 11 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను జిల్లా కోర్డుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమించనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఏదైనా డిగ్రీ అర్హతతోపాటు, టైప్ రైటింగ్, పీజీ డిప్లొమా(కంప్యూటర్) లేదా బీసీఏ ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 29 నుంచి ప్రారంభంకానుంది. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు నవంబరు 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు.. టైప్ రైటింగ్ (హయ్యర్ గ్రేడ్ ఎగ్జామ్-ఇంగ్లిష్), పీజీ డిప్లొమా(కంప్యూటర్) లేదా బీసీఏ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.10.2022.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 15.11.2012.

ఎంపిక ఇలా..

అభ్యర్థులకు ఆన్ లైన్ విధానంలో పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 80 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. 90 నిమిషాల్లో మొత్తం 80 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. వీటిలొ మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు తదుపరి దశకు పిలుస్తారు. వీటిలో జనరల్ నాలెడ్జ్-30 ప్రశ్నలు-30 మార్కులు, జనరల్ ఇంగ్లిష్-20 ప్రశ్నలు-20 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్-20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. ఈ రాత పరీక్షలో కనీసం 40 శాతం మార్కులు సాధించిన వారు అర్హత సాధిస్తారు. ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్ధులు 30 శాతం మార్కులు సాధిస్తే చాలు. కనీస అర్హత మార్కులు వచ్చిన అభ్యర్థులను మాత్రమే ఉద్యోగ ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు. రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా ప్రకటిస్తారు.

దరఖాస్తు ఫీజు

దరఖాస్తులను ఆన్‌లైన్ మోడ్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.400 ఫీజు చెల్లించాలి. ఎంపికైన వారికి నెలకు రూ.40,970 – రూ.1,24,380 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ ఇలా..

ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దీనిలో నోటిఫికేషన్ ను డౌన్ లోడ్ చేసుకుని అర్హతలను చెక్ చేసుకోవాలి. వాటికి అర్హులుగా ఉంటే.. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 29 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల సమయంలో ఏమైనా సందేహాలు ఉంటే.. 0863-2372752నంబర్ కు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ మెయిల్ ఐడీ [email protected] కూడా సంప్రదించవచ్చు.

About Author