PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చెస్ విజేతలకు  జిల్లా పరిషత్ చైర్పర్సన్ దంపతులు అభినందనలు

1 min read

గురువులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి..

భవిష్యత్తులో మరింతగా రాణించాలని ఆకాంక్షిస్తూన్న ..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో విజయం సాధించిన ఏలూరు జిల్లాకు చెందిన చిన్నారులను ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ దంపతులు వారి క్యాంపు కార్యాలయంలో అభినందించారు. చెస్ అంటే మెదడుకు మేత అంటుంటారని, ఇంత చిన్న వయసులో తెలివిగా విజేతలుగా నిలవడం అభినందనీయమన్నారు. ఇటీవల భీమవరంలో జరిగిన చెస్ పోటీల్లో అండర్ సెవెన్ విభాగంలో ద్వితీయ స్థానం సాధించిన అనురూప్ మోషే , అండర్ టెన్ విభాగంలో నాలుగో స్థానం సాధించిన అభిషేక్ అబ్రహం మరో విజత వియన్ రాజ్ లు విజయం సాధించారు. వారి ఉద్దేశిస్తూ రాబోయే రోజుల్లో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించి గురువులకు, తల్లిదండ్రులకు, పెద్దలకు, మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.

About Author