PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డా.రమేష్​కు..అభినందన

1 min read

కర్నూలు అడ్వైజరీ కమిటీ మెంబరుగా ఎంపిక

  • హర్షం వ్యక్తం చేసిన విభిన్న ప్రతిభావంతులు

పల్లెవెలుగు: విభిన్న ప్రతిభావంతుల హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్రస్థాయి సలహా మండలి స్టేట్ అడ్వైజరీ కమిటీ బోర్డు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర  నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రతి జిల్లాకు ఒక అడ్వైజరీ కమిటీ మెంబర్ ఏర్పాటులో భాగంగా కర్నూలు జిల్లాకు  డాక్టర్ బి. రమేష్ ను  ఎంపిక చేసినందున జిల్లా వికలాంగుల ఉద్యోగుల సంఘం,  జిల్లా వికలాంగుల నిరుద్యోగుల సంఘం మరియు అనుబంధ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. డాక్టర్ బి రమేష్ నివాసంలో ఆయనను కలిసి, కే. కృష్ణుడు , వీరేష్ బాబు, ఎం. వెంకటేశ్వర్లు, కే.కృష్ణ , రమణారెడ్డి మొదలగు వారు అభినందనలు తెలిపారు.

About Author