పథకాలు కొనసాగించండి.. మళ్లీ గెలిపిస్తాం..
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2024/04/640.jpg?fit=550%2C367&ssl=1)
ఇంతియాజ్ తో ప్రజల మాటామంతి
- బుధవారపేటలో..వైసీపీ విస్తృత ప్రచారం
కర్నూలు, పల్లెవెలుగు: వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు బాగున్నాయని, అలాగే కొనసాగించాలని బుధవారపేట వాసులు కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఇంతియాజ్తో పేర్కొన్నారు. శనివారం మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డితో కలిసి ఇంతియాజ్ బుధవార పేట 15వ వార్డులో ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ ప్రజలతో మాట్లాడారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కొనసాగలంటే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరో అవకాశం ఇవ్వాలని కోరగా.. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. పథకాలు కొనసాగించాలని… మళ్లీ జగన్ ను సీఎం చేస్తామని ప్రజలు పేర్కొన్నట్లు అభ్యర్థి ఇంతియాజ్ వెల్లడించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2024/04/641.jpg?resize=550%2C367&ssl=1)