PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పథకాలు కొనసాగించండి.. మళ్లీ గెలిపిస్తాం..

1 min read

ఇంతియాజ్​ తో ప్రజల మాటామంతి

  • బుధవారపేటలో..వైసీపీ విస్తృత ప్రచారం

కర్నూలు, పల్లెవెలుగు: వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు బాగున్నాయని, అలాగే కొనసాగించాలని బుధవారపేట వాసులు కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఇంతియాజ్​తో పేర్కొన్నారు. శనివారం మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డితో కలిసి ఇంతియాజ్​ బుధవార పేట 15వ వార్డులో ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంతియాజ్​ ప్రజలతో మాట్లాడారు.  సంక్షేమ పథకాలు, అభివృద్ధి కొనసాగలంటే సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డికి మరో అవకాశం ఇవ్వాలని కోరగా.. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. పథకాలు కొనసాగించాలని… మళ్లీ  జగన్​ ను సీఎం చేస్తామని ప్రజలు పేర్కొన్నట్లు అభ్యర్థి ఇంతియాజ్​ వెల్లడించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author