PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆదోని అభివృద్ధికి కృషి చేస్తా…

1 min read

పట్టణాన్ని సుందరవనంగా తీర్చిదిద్దుతా…

  • ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి

 ఆదోని, పల్లెవెలుగు: సార్వత్రిక ఎన్నికల్లో తనను గెలిపిస్తే… ఆదోని పట్టణాన్ని సుందరవనంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు  కూటమి అభ్యర్థి డా. పార్థసారధి. పట్టణ నడిబొడ్డున రోడ్ల విస్తరణ లేక… కొన్నేళ్లుగా ట్రాఫిక్​ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కానీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డి అవేమీ పట్టించుకోవడంలేదన్నారు. అభివృద్ధిపై దృష్టి లేదని, కేవలం భూ కబ్జాలు,దందాలతో అక్రమార్జనే ధ్యేయం పెట్టుకున్నారని ఆరోపించారు. సోమవారం పట్టణంలోని న్యూ గాంధీ నగర్​, క్రాంతినగర్​లో కూటమి నేతలు విస్తృత ప్రచారం నిర్వహించారు. నిత్యం అందుబాటులో ఉండి సేవ చేస్తానని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జగనన్న కాలనీ అంటూ… ఉచితంగా ఇల్లు కట్టిస్తానని చెప్పి మోసం చేశారని, కనీసం టిడ్కో ఇల్లు కూడా ఎందుకు ఇవ్వలేదో ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, గుడిసె కృష్ణమ్మ, జనసేన ఇన్​ఛార్జ్​ మల్లప్ప, మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్​ జైన్​, భూపాల్​ చౌదరి, బుద్దారెడ్డి, క్రాంతినగర్​ నాయకులు జె.శివ శంకర్​, జి. నాగేంద్ర రెడ్డి, కోట ఈరన్న, జక్కా వీరేష్​, కోట రామాంజి, చిలుక రవి, విజయ్​ (చిన్న) తదితరులు పాల్గొన్నారు.

About Author