PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాజంపేటలో ఆనందయ్యమందు పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాజంపేట: ప్రజల ప్రాణాలు కాపాడేందుకే ఆనందయ్య మందు పంపిణీ చేస్తున్నామని రాజంపేట నియోజకవర్గ వైసీపీ నాయకుడు గాలివీటి విజయ్​ సాగర్​ రెడ్డి (మదన్​ రెడ్డి) పేర్కొన్నారు. శనివారం వీరబల్లి మండలపరిధిలో 300 మందికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆనందయ్య మందు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మదన్​ రెడ్డి మాట్లాడుతూ కరోనా రాకుండా మరియు రోగ నిరోధక శక్తి ని పెంచుతుందని ఈ మందుని ప్రజలకు ఉచితంగా ప్రజలకు అందించామన్నారు. కంటికి కనపడని కరోనా మహమ్మారి పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అదేవిధంగా బయటకు వెళ్ళేటప్పుడు మాస్కులు, శానిటైజర్ తమ విధిగా వెంట తీసుకుని వెళ్లాలన్నారు.ఈ కార్యక్రమంలో వై సి పి నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వీరబల్లి మాజీ ఎంపీపీ ,వైసీపీ సీనియర్ నాయకులు గాలివీటి.విజయభాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రజలకు అందజేశారు.

About Author