PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రార్థనలలో పాలొన్న ముస్లీం సోదరులకు మంచినీటి బాటిళ్లు పంపిణీ

1 min read

– నారా లోకేష్ సహకారంతో మంచినీటి బాటిళ్లు పంపిణీ చేసిన స్థానిక నాయకులు
పల్లెవెలుగు వెబ్ మంగళగిరి: రంజాన్ పర్వదినంను పురస్కరించుకొని మంగళగిరి పట్టణంలో ఈద్గాహ్ మసీదులో ప్రార్థనలకు వచ్చిన ముస్లీం సోదరులకు వేసవి కాలం దృష్ట్యా నారా లోకేష్ సహకారంతో మంచినీటి బాటిళ్లను స్థానిక నాయకులు శనివారం పంపిణీ చేశారు. తద్వారా మత సామరస్యతకు ప్రతీకగా నిలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారా లోకేష్ అన్ని మతాలను గౌరవిస్తూ క్రిస్ట్మస్ కానుకగా పాస్టర్లకు,ఉగాది కానుకగా పూజారులకు ,రంజాన్ సందర్బంగా ఇమామ్‌లు, మౌజం‌లకు పండగ కానుకలతో పాటు మంగళగిరిలో ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్న తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో ఏక కాలంలో 9 చోట్ల ముస్లీం సోదర సోదరీమణులకు ఇఫ్తార్ విందు ఇఫ్తార్ విందు ఇచ్చినట్లు తెలిపారు. నారా లోకేష్ వేసవి కాలంను దృష్టిలో పెట్టుకొని ముస్లీం సోదరులకు మంచినీటి బాటిళ్లు పంపిణీ చేయడం అభినందించదగ్గ విషయం అని ముస్లీం సోదరులు అన్నారు. నారా లోకేష్ తో పాటు అందరికి అల్లా అశీస్సులు ఉండాలని ముస్లీం సోదరులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ టీడీపీ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహ్మద్ ఇబ్రహీం, రాష్ట్ర టీడీపీ మైనార్టీ సెల్ కార్యదర్శి అబ్దుల్ మజీద్, రాష్ట్ర పద్మశాలి సమితి మీడియా కో-ఆర్డినేటర్ తిరువీధుల బాపణయ్య, గుంటూరు పార్లమెంట్ మైనార్టీ సెల్ కార్యనిర్వాహణ కార్యదర్శి షేక్ ఫిరోజ్, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు మాజేటి సూర్యగోపాలకృష్ణ శ్రేష్ఠి, పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు వాకా మాధవరావు, నియోజకవర్గ టి.ఎన్.టి.యు.సి కార్యనిర్వాహణ కార్యదర్శి చింతా వెంకటేశ్వరరావు, పట్టణ తెలుగు యువత ఉపాధ్యక్షులు మహ్మద్ ఆరిఫ్, పట్టణ టీ.ఎన్.ఎస్.ఎఫ్ అధ్యక్షులు మహ్మద్ షరీఫ్, జంజనం వెంకట సుబ్బారావు, జొన్నాదుల బాలకృష్ణ, పట్టణ బీసీ సెల్ కార్యనిర్వాహణ కార్యదర్శి, వడిశా నరేష్, 19 వ వార్డు ప్రధాన కార్యదర్శి తాటిచర్ల వీరన్న, షేక్ హూస్సేన్ కొత్తపేట, షాహింష, వింజమూరి చంద్రశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు.

About Author