PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హిందువులు మైనార్టీలుగా భావించొద్దు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బంగ్లాదేశ్‌లో అందరికీ సమాన హక్కులు ఉన్నాయని ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా చెప్పారు. హిందువులు తమను తాము మైనారిటీలుగా భావించవద్దని చెప్పారు. మతంతో సంబంధం లేకుండా దేశంలో అందరూ సమాన హక్కులను అనుభవించవచ్చునని తెలిపారు. అయితే ఏదైనా చిన్న దాడి జరిగినపుడు దేశంలో హిందువులకు రక్షణ లేదని ప్రచారం చేయవద్దని హితవు పలికారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఢాకేశ్వరి దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె వర్చువల్ విధానంలో పాల్గొన్నారు.

                                               

About Author