PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దుర్గా భోగేశ్వరుడి కళ్యాణం కమనీయం..

1 min read

మహాశివరాత్రి సందర్భంగా కిక్కరిసిన శైవ క్షేత్రం..

పల్లెవెలుగు వెబ్ గడివేముల:   గడిగరేవుల గ్రామ పరిధిలో వెలసినటువంటి శ్రీ దుర్గా భోగేశ్వరం స్వామి దేవస్థానంలో శనివారం నాడు తెల్లవారుజామున   స్వామి వారి కల్యాణం మరియు ధూప దీప నైవేద్యం,మహాన్యాస పూర్వక ఏక వర రుద్రాభిషేకం అత్యంత వైభవంగా అశేష జన వాహిని మధ్య ఆలయ కమిటీ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు  భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని క్షేత్రంలో గల పంచామృత కొనేర్లలో స్నానం ఆచరించి స్వామి వారికి అభిషేకాలు,అర్చనలు,ప్రత్యేక పూజలలో పాల్గొన్నార.ఈరోజు   స్వామి వారి కళ్యాణంలో  ఆలయ చైర్మన్ ఐసాని సునీల్ కుమార్ రెడ్డి దంపతులు, . భక్తులకుఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈవో చంద్రశేఖర్ రెడ్డి  మరియు ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు..వచ్చిన భక్తులకు ఆర్యవైశ్య సత్రం నందు మరియ కాశి రెడ్డి నాయన ఆశ్రమం నందు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

About Author