PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎడిఫై స్కూల్ సమ్మర్ క్యాంపు ముగింపు వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నందు సమ్మర్ క్యాంపు 2024 ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. సమ్మర్ క్యాంపు లో పాల్గొన్నటువంటి విద్యార్థి విద్యార్థులు అదేవిధంగా పాఠశాల ప్రిన్సిపాల్ అయినటువంటి డాక్టర్ జోసఫ్ డేవిడ్ అదే విధంగా కోఆర్డినేటర్ సురేష్  మిగతా క్రీడా అధ్యాపకులు స్కూలు అకడెమిక్  సిబ్బంది  మరియు నాన్ టీచింగ్ సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ వేడుకల్లో పాల్గొన్నటువంటి ప్రతి విద్యార్థికి వారు నిర్వహించినటువంటి పోటీలలో వచ్చినటువంటి ఉత్తమమైన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేయడం జరిగి ఉన్నది. పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రిన్సిపాల్  అయినటువంటి డాక్టర్ జోసఫ్ అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థి విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఎంతో చక్కగా ఆనందంగా మాట్లాడుతూ ఇటువంటి సమ్మర్ క్యాంపులు నిర్వహించడం ఇటువంటి ఉత్తమమైన శిక్షణతో ఉన్నటు వంటి గొప్ప ఆటపాటలతో కూడినటువంటి క్రీడలు నిర్వహించటం  అనేది చాలా గోపా విషయం అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులతోపాటు విద్యార్థి విద్యార్థులను కూడా మాట్లాడటం జరిగి ఉన్నది. ఇటువంటి సమ్మర్ క్యాంపు వేడుకలు మరిన్ని జరపాలని వారు ఎంతగానో ఆనందిస్తూ సంతోషిస్తూ ఈ యొక్క వేడుకలు ముగించడం జరిగింది.

About Author