ఏలూరు నియోజకవర్గం అధ్యక్ష , కార్యదర్శిగా హరీష్, జయరాం ఎన్నిక..
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2023/11/14-2.jpg?fit=550%2C249&ssl=1)
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : స్థానిక నరసింహరావుపేట ( ఇండోర్ స్టేడియం) ఎదురుగా మహిళా విశ్రాంతి భవనం నందు ఏపీడబ్ల్యూజేఎఫ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఫెడరేషన్ వ్యవస్థాపక ఉపాధ్యక్షులు ఆంజనేయులు మరియు రాష్ట్ర సభ్యులు. నియోజకవర్గాల అధ్యక్ష కార్యదర్శులు సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలలో గత కొంతకాలంగా మండల స్థాయిలో అధ్యక్ష ,కార్యదర్శులను సంఘ సభ్యులను ఎన్నుకోవడం తెలిసిన విషయమే. ఏలూరు నియోజకవర్గంలో అధ్యక్ష పదవి ఖాళీ ఏర్పడడంతో ఆ పదవికి అధ్యక్షులుగా ఆంధ్రప్రభ ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ ను అలాగే అదే దినపత్రికలో పనిచేస్తున్న ఏలూరు టౌన్ రిపోర్టర్ జయరాo ను సంఘ సభ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు సంఘ సభ్యులు సమక్షంలో అధ్యక్ష, కార్యదర్శి గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టు సంఘం జర్నలిస్టుల సమస్యలపై బలంగా పనిచేస్తున్న విషయం విధితమే, సంఘంలో చురుకుగా పనిచేసే యువ జర్నలిస్టులను నియోజకవర్గ స్థాయిలో ఎన్నుకుంటున్నారు. గత దశాబ్ద కాలం పైబడి ఎన్నో జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేసి మరెన్నో సమస్యలను అధిగమిస్తూ మంత్రులను, ప్రజా ప్రతినిధులను, అధికారుల చే సమస్యలు పరిష్కరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు బాలశౌరి, విజయ కుమారి,శేఖర్, జబీర్, శంకర్రావు, నవీన్ రాజు గోపాలకృష్ణ మరియు నియోజకవర్గాల అధ్యక్ష ,కార్యదర్శులు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2023/11/141-1.jpg?resize=550%2C248&ssl=1)