PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాజీ ప్ర‌ధాని షింజో అబే దారుణ హ‌త్య !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జపాన్‌ మాజీ ప్రధాన మంత్రి షింజో అబే దారుణ హత్యకు గురయ్యారు. పశ్చిమ జపాన్‌లోని నారా నగరంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలపాలైన ఆయనను నారా మెడికల్ యూనివర్సిటీ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు ఆయనను కాపాడేందుకు దాదాపు ఐదున్నర గంటలపాటు శ్రమించినా ఫలితం దక్కలేదు. నారా మెడికల్ యూనివర్సిటీ హాస్పిటల్‌లోని ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రొఫెసర్ హిడెటడ ఫొకుషిమ మాట్లాడుతూ, షింజో అబే మధ్యాహ్నం 12.20 గంటలకు తమ ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. ఆయన ఆసుపత్రికి చేరుకునేసరికి కార్డియాక్ అరెస్ట్ స్థితిలో ఉన్నట్లు తెలిపారు. వైద్యులు తీవ్రంగా కృషి చేసినప్పటికీ ఆయన సాయంత్రం 5.03 గంటలకు తుది శ్వాస విడిచారని చెప్పారు.

                                       

About Author