PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సహకార బ్యాంకు సేవలు గ్రామీణ ప్రాంతానికి విస్తరిస్తున్నాం

1 min read

శ్రీమతి ఎస్ వి విజయ మనోహరి  కే డి సి సి చైర్మన్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షురాలు శ్రీమతి ఎస్ వి విజయ మనోహరి  నియోజకవర్గంలోని ఎద్దు పెంటలో కేంద్ర బ్యాంకు నూతన కార్యాలయాన్ని  రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తో కలిసి  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్నన్న ఆదేశాల మేరకు  రైతన్నలకు బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఉద్దేశంతో మారుమూల ప్రాంతాలలో కూడా బ్రాంచీలను ప్రారంభిస్తున్నామని నేను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆర్థిక శాఖ మాత్యులు శ్రీ బుగ్గల రాజేంద్రనాథ్ రెడ్డి  మాట్లాడుతూ జగనన్న తోడ్పాటుతో డోన్ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని వెనుకబడిన ప్రాంతమైన ఈ ప్రాంతానికి రుణాలు విరివిగా మంజూరు చేయాలని శ్రీమతి విజయ మనోహరి ని కోరారు. కార్యక్రమంలో బ్యాంకు అధికారులు సొసైటీ డైరెక్టర్స్ పాల్గొన్నారు.

About Author