PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విశాఖ‌లో తీవ్ర ఉద్రిక్త‌త !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : విశాఖప‌ట్నంలో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. పెద్ద‌జాల‌రిపేట‌, చిన్న‌జాల‌రిపేట మ‌త్య్స‌కారుల మ‌ధ్య రింగువ‌ల‌ల వివాదం చోటుచేసుకుంది. ఒక వ‌ర్గం వారు రింగువ‌ల‌ల‌తో వేట‌కు వెళ్ల‌డం.. మ‌రొక వ‌ర్గం దానిని అడ్డుకోవ‌డం ఉద్రిక్త‌త‌కు దారితీసింది. ఈ నేప‌థ్యంలో ఓ వ‌ర్గం వారు స‌ముద్రంలోని ఓ ప‌డ‌వ‌కు నిప్పు పెట్టారు. దీంతో ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అక్క‌డికి భారీగా చేరుకుని ప‌రిస్థితిని అదుపులోకి తెస్తున్నారు. స‌ముద్రంలోకి వెళ్లిన బోట్ల‌ను బ‌య‌టికి తెప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. త‌మ బోట్ల‌కు నిప్పుపెట్టార‌ని, త‌మ పిల్ల‌ల‌ను అప‌హ‌రించార‌ని ఓ వ‌ర్గం మ‌హిళ‌లు ఆరోపిస్తున్నారు.

                                           

About Author