PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇమ్రాన్ పై కాల్పులు.. దుండగుడి కాల్చివేత

1 min read

పల్లెవెలుగువెబ్ : పాక్ లో ముందస్తు ఎన్నికలు జరపాలన్న డిమాండ్ తో పీటీఐ పార్టీ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లాంగ్ మార్చ్ ర్యాలీ చేపట్టగా, ఆయనపై ఓ దుండగుడు కాల్పులు జరపడం తెలిసిందే. ఈ ర్యాలీ వజీరాబాద్ చేరుకున్న సమయంలో జనసమూహంలో ఉన్న ఓ వ్యక్తి తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇమ్రాన్ కు గాయాలయ్యాయి. కాగా, కాల్పులు జరిపిన వ్యక్తిని భద్రతా బలగాలు కాల్చిచంపినట్టు వెల్లడైంది. ఇమ్రాన్ ఖాన్ సన్నిహితవర్గాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా ఈ మేరకు వెల్లడింది. కాల్పుల్లో గాయపడిన ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పీటీఐ వర్గాలు తెలిపాయి.

About Author