PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆదోని ప్రజల కోసం… మా పోరాటం..

1 min read

రోడ్లు వేయండని అడిగితే…దాడులా…?

  • పదైదేళ్లు ఎమ్మెల్యే సాయిప్రసాద్​ రెడ్డిఅరాచకం..
  • వైసీపీకి ఓటు వేయొద్దు….
  • కమలం గుర్తుకు ఓటు వేయండి….
  • నన్ను ఆశీర్వదించండి… అభివృద్ధి చేసి చూపిస్తా…
  • ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి

ఆదోని, పల్లెవెలుగు: ఆదోని అభివృద్ధి పట్టించుకోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డి… బెదిరింపులు…దాడులతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ కాలం గడుపుతున్నాడని, ఇటవంటి వ్యక్తికి మరోసారి అవకాశం ఇచ్చి… బానిస బతుకులు బతుకుతారా… అని పట్టణ ప్రజలను ప్రశ్నించారు ఆదోని కూటమి (బీజేపీ–జనసేన–టీడీపీ) అభ్యర్థి డా. పార్థసారధి.  గురువారం పట్టణంలోని ఎన్టీ ఆర్​ నగర్​, టీజీఎల్​ కాలనీ, కుమ్మరిగేరి, గణేష్​ సర్కిల్​ లో కూటమి నేతలు విస్తృత ప్రచారం చేశారు.  ఈ సందర్భంగా డా. పార్థసారధి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు పంపితే… వెచ్చించి… అభివృద్ధి చేయకుండా .. నిధులను వెనక్కి పంపాడని, మిమ్నల్ని ఇలాగే అణిచి వేస్తున్నాడని ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లు వేయరు… రోడ్ల విస్తరణ పట్టించుకోరు… తాగునీరు..వీధిలైట్లు… ఇలా కనీస వసతులు కూడా ఎందుకు కల్పించలేదో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. రోడ్లు బాగా లేవని చెప్పిన ఓ యువకుడిపై ఎమ్మెల్యే అనుచరులు దాడులు చేశాడని,  ఎవరు నోరెత్తకుండా దాడులు… అరాచకాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. భూ కబ్జా, రేషన్​, ఇసుక, మద్యం, మట్కా మాఫియాను పెంచి పోషిస్తూ..  కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన ఎమ్మెల్యే సాయిప్రసాద్​ రెడ్డిని … ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడించాలని పిలుపునిచ్చారు. తనకు ఒక్క అవకాశం ఇచ్చి… ఆశీర్వదిస్తే ఆదోనిని  మోడల్​ నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత నాది… అని పట్టణ ప్రజలకు  కూటమి అభ్యర్థి డా. పార్థసారధి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన ఇన్​చార్జ్​ మల్లప్ప, టీడీపీ , బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

About Author