మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇకలేరు !
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2022/05/4174.jpg?fit=500%2C673&ssl=1)
పల్లెవెలుగువెబ్ : టీడీపీ నేత, మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంలో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గోపాలకృష్ణారెడ్డి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ సీఎం చంద్రబాబు కేబినెట్లో ఆయన అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. అలిపిరి ఘటనలో చంద్రబాబుతో పాటు బొజ్జల కూడా గాయపడ్డారు. బొజ్జల మృతిపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.