PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెలుగుదేశం గెలిస్తేనే ప్రజలకు భవిష్యత్తు..

1 min read

– టిడిపి నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే ప్రజలకు భవిష్యత్తు ఉంటుందని టిడిపి కర్నూలు నగర కమిటీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్ అన్నారు. శుక్రవారం నగరంలోని 1 వ వార్డు పెద్ద మార్కెట్లో తెలుగుదేశం పిలుస్తోంది నగరమా మేలుకో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా నాగరాజు యాదవ్ మాట్లాడుతూ కర్నూల్లో టి.జి భరత్ గెలవాలని, రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేందుకు తామంతా ప్రజల్లో తిరిగి చైతన్యం తెచ్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. వార్డులోని దుకాణాలు, వీధుల్లోని ఇళ్ల వద్దకు వెళ్లి ప్రజలను కలిసి తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాల గురించి వివరించారు. నాలుగున్నర సంవత్సరాలుగా ఈ ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఓటు వేసి టి.జి భరత్ ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. భరత్ గెలిస్తే స్థానికంగా ఉన్న యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటారని చెప్పారు. టిడిపి గెలిస్తేనే సంక్షేమం, అభివ్రుద్ది ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో నేతలు మన్సూర్ ఆలీఖాన్, భాస్కర్, అబ్బాస్, రామాంజనేయులు, హమీద్, వినోద్ చౌదరి, రమేష్, రమీజ్, ఈశ్వర్, రాజశేఖర్ రెడ్డి, గణేశ్, ఏసు, మణి ప్రకాష్, మహిళా నాయకురాళ్లు రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి, నాగేశ్వరి, లలితమ్మ, తదితరులు పాల్గొన్నారు.

About Author