PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దివ్యాంగురాలికి ల్యాప్ టాప్ అందజేత…

1 min read

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా విభిన్నప్రతిబావంతులు,వయోవృద్ధుల సంక్షేమశాఖ అధికారిణి

 పి. రాకడ మణి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : చెవిటి, మూగ దివ్యంగురాలైన బి.కాం., మొదటి సంవత్సరం విద్యనభ్యసిస్తున్న మేలే లీలాంబిక విద్యార్ధినికి బుధవారం ఏలూరు జిల్లా విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాకడ మణి ల్యాప్ టాప్ ను అందజేశారు.  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగులైన విద్యనభ్యసిస్తున్న విద్యార్దులకు ల్యాప్ టాప్ సౌకర్యం కల్పించిందని ఇందులో బాగంగా పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం వర్జేడు గ్రామానికి చెందిన మేలే లీలాంబిక కు  ల్యాప్ టాప్ అందించడం జరిగిందని, ఆమె విద్యకు ల్యాప్ టాప్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని  ఎడి  తెలిపారు.

About Author