రైతులకు శుభవార్త.. కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల ఎప్పుడంటే ?
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2021/11/pm-kisan.jpg?fit=500%2C333&ssl=1)
పల్లెవెలుగు వెబ్ : కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. త్వరలో రైతులకు కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేయనుంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 10వ విడత నిధులను డిసెంబర్ 15 వతేదీ నాటికి విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. పీఎం కిసాన్ పథకం కింద నమోదు చేసుకున్న రైతులందరికీ రూ.2000 అందుతాయి. ఈ పథకం కింద నగదు పొందేందుకు అర్హత ఉంటే, కొత్త రైతులైనా కిసాన్ యోజన కింద సులభంగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చునని కేంద్రం తెలిపింది.రైతులు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో సులభంగా తనిఖీ చేసుకోవచ్చు.