PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అతడే ఒక సైన్యం..!

1 min read

ఆకాశమంత అభిమానం..

ఒకరికి ఒకరై వేల మంది తోడై.

ఆర్థర్  నినాదాన్ని హోరెత్తిస్తూ..

గ్రామాలలో  రెపరెపలాడిన కాంగ్రెస్ పార్టీ జెండాలు. 

అభిమానుల ఆత్మీయ, ప్రేమానురాగాలు.. 

పండుగ వాతావరణంలా సాగుతున్న ఎంఎల్ఏ ఆర్థర్  ఎన్నికల ప్రచారం.

ఎంఎల్ఏ ను  అక్కున చేర్చుకున్న వివిధ వర్గాల ప్రజలు  .

సంగమేశ్వరం లో  ప్రత్యేక ప్రార్థనలతో ప్రారంభమైన ఆర్థర్ ప్రచారం.

ఇంటింటి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి  ఓట్లు వెయ్యాలని అభ్యర్థన.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ ..ఈ పేరు తెలియని వారంటూ ఎవరు లేరు..ప్రజల హృదయాలలో సుస్థిరమైన  స్థానం సంపాదించుకున్నారు.2019 లో వైసీపీ తరుపున 40 వేలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఎమ్మెల్యే గా ఎన్నికైన తర్వాత నియోజకవర్గ ప్రజలకు సేవా చేయాలని నియోజకవర్గాన్నీ అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని కలలు కన్నారు. కానీ అగ్రకుల పెత్తనం ఆర్థర్ అధికారాన్ని అడ్డుకోవడం జరిగింది. దళిత ఎమ్మెల్యే కు అడుగడుగునా ఆడంకులు సృష్టించారు. 2024లో వైసీపీ టికెట్ రాకుండా అడ్డుకున్నారు.వైసీపీ అధిష్టానం సైతం నందికొట్కూరు వైసీపీ అగ్రకుల నాయకుల పెత్తందారీ వ్యవస్థ కింద పని చేయాలని అలాగ అయితేనే నందికొట్కూరు టికెట్ ఇస్తామని ప్రతిపాదనలు పంపింది. కానీ ఆర్థర్ ఆత్మగౌరవం చంపుకొని ఒకరి కింద పని చేయనని అధిష్టానం వైఖరిని వ్యతిరేకించారు. అధికారం లేని ఎమ్మెల్యే టికెట్ అవసరం లేదని తేల్చిచెప్పారు. వైసీపీ పార్టీకి రాజీనామా చేసి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందరూ హేళన చేశారు. కానీ మొక్కవోని ధైర్యం తో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అతడే ఒక సైన్యంగా తొలి అడుగు సంగమేశ్వరం లో మొదలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి  ఊహించని రీతిలో విశేష స్పందన లభిస్తోంది. ఎన్నికల బరీలో నిలిచిన ప్రధాన పార్టీలకు ఆర్థర్ ముచ్చమటలు పట్టిస్తున్నారు. ఆర్థర్ కు  నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 

గడపగడప ద్వారా ప్రతి ఇంటికి పరిచయం..

2022 మే 11 న కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం గ్రామంలో గడపగడప మన ప్రభుత్వ కార్యక్రమం ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ ప్రారంభించారు.  2023 నవంబరు 7  పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రి గ్రామంలో గడపగడప కార్యక్రమం పూర్తి చేశారు.  మొత్తం 162 రోజులలో మొత్తం 86 సచివాలయాలు, 152 గ్రామాల (మజర) లోని   83,460  గృహాలను ప్రత్యక్షంగా సందర్శించారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటిని స్వయంగా వెళ్లి పలకరించిన అనుభవం ఆర్థర్ సొంతం. ఇప్పటికే ఆర్థర్ ఎన్నికల ప్రచారం పూర్తి చేశారు.

నిత్యం ప్రజాసేవే ద్వేయంగా…

నిత్యం ప్రజా సేవే ద్యేయంగా అడుగులు ముందుకు వేస్తూ, ప్రజల కష్టాలు తెలుసుకుని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూ, ఎవరెన్ని విమర్శలు చేసినా భరిస్తూ తన పని తాను చేసుకుంటూ ప్రజల కోసం పరితపించే జన సైనికుడు , ప్రజల నుండి ఒక సౌమ్యుడుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నాయకుడు నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే తొగురు ఆర్థర్. గత ఐదు ఏళ్ళ పాలనలో ప్రజలకు ప్రతి రోజు అందుబాటులో ఉంటూ అహర్నిశలు శ్రమిస్తూ  ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారు ఎమ్మెల్యే ఆర్థర్. కరోన సమయంలో ఫస్ట్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ లలో ప్రజలకు అందుబాటులో వుంటూ గ్రామాల్లో వీధి వీధిన తిరిగి ప్రజలకు కరోన వైరస్ పై అవగాహన కల్పించి ప్రజల మన్ననలు పొందారు. అంతే కాకుండా కోవిడ్ ఫస్ట్, సెకండ్ వేవ్ కరోన సమయంలో పనుల్లేక, తినేందుకు తిండి లేక ఇబ్బందులు పడే కుటుంబాల్లో నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేసి ఆపద్బాంధవుడిగా పేదలను ఆదుకున్నారు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కు సంఘీభావంగా నందికొట్కూరు నియోజకవర్గంలో 189కి. మీ పాదయాత్ర చేసి సంచలనం సృష్టించారు. కరోనా సమయంలో చేసిన సేవలను గుర్తించి లండన్ లిమ్కా బుక్ ఆఫ్ అవార్డు తో సత్కరించారు.

ఆకాశమంత అభిమానం ఆర్థర్ సొంతం…

ఆకాశమంత అభిమానం ఎమ్మెల్యే ఆర్థర్ సొంతం.నియోజకవర్గంలో ప్రతి గ్రామము నుంచి కాంగ్రెస్ పార్టీకి అశేషమైన ప్రజల మద్దతు లభిస్తుంది. ఒకరికి ఒకరై వేలాది మంది తోడై ఆర్థర్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఏప్రిల్ 12 సంగమేశ్వరుడి సాక్షిగా పూజలు నిర్వహించి ప్రారంభమైన ఎన్నికల ప్రచారం వైసీపీ టీడీపీ పార్టీ నేతలకు చమటలు పట్టిస్తుంది. గ్రామగ్రామాన కాంగ్రెస్ జెండా రెపరేపలాడుతుంది.కాంగ్రేస్ పార్టీలోకి వలసలు రోజు రోజుకు జోరందుకున్నాయి. బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు ముస్లిం మైనారిటీ లు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తొగురు ఆర్థర్ ను గెలిపించాలని ఊరువాడ ఒక్కటై ప్రచారం నిర్వహిస్తున్నారు. అతడే ఒక సైన్యమై ఆర్థర్ ఎన్నికల ప్రచారంలో  దూసుకుపోతున్నారు.

About Author