PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

5 వేల కార్లు దొంగ‌లించాడు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఒకటి కాదు, రెండు కాదు, 5వేల కార్లను దొంగిలించాడు. ఈక్రమంలో అనేకమందిని హత్య చేశాడు. 27ఏళ్లుగా కూడబెట్టిన ఆ దొంగసొమ్ముతో ఢిల్లీ, ముంబై, ఈశాన్య రాష్ట్రాల్లో భారీగా ఆస్తులను కొనుగోలు చేశాడు. ముగ్గురు భార్యలు, ఏడుగురు పిల్లలతో విలాసంగా జీవితాన్ని గడుపుతున్నాడు. దేశంలోనే అతిపెద్ద కార్ల దొంగగా పోలీసులు అభివర్ణిస్తున్న అతడి పేరు అనిల్‌ చౌహాన్‌. ఢిల్లీ పోలీసులు తాజాగా ఈ 52ఏళ్ల ఘరానా దొంగను అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ వర్గాల నుంచి తమకు అందిన సమాచార ప్రకారం వల పన్ని నగరంలోని దేశబంధు గుప్తా రోడ్డు ప్రాంతంలో అనిల్‌ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. అతడు ప్రస్తుతం ఆయుధాల అక్రమ రవాణా వ్యాపారంలో ఉన్నాడని, ఉత్తర ప్రదేశ్‌ నుంచి ఆయుధాలను ఈశాన్య రాష్ట్రాల్లో నిషేధిత సంస్థలకు సరఫరా చేస్తున్నాడని పేర్కొన్నారు.

                                 

About Author